ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే వచ్చి అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిళ. ఇక్కడ జరిగిన సర్వేలన్నీ కూడా దాదాపుగా వైసీపీ విజయం సాదిస్తుందని చెబుతున్నాయి. గుంటూరుజిల్లా మంగళగిరిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న షర్మిళ సింహం సింగిల్ గానే వస్తుందన్నట్టు వైసీపీ కూడా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో నిలిచిందని అన్నారు.

మనకు ఇప్పుడు రాజన్న రాజ్యం కావాలంటే జగన్ అధికారంలోకి రావాలని షర్మిళ అన్నారు. అంతేకాని ప్రత్యర్ధులు పెట్టె ప్రలోభాలకు లొంగకూడదని ప్రజలకు సూచించారు. జాబు కావాలంటే బాబు రావాలని, బాబు వస్తే జాబు వస్తుందని అన్నారు కానీ, బాబు వస్తే కరవు వచ్చింది తప్ప ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలందరూ కూడా టీడీపీ కి తగిన బుద్ది చెప్పి వైసీపీ కి అధికారం కట్టబెట్టడం ఖాయమని షర్మిళ వ్యక్తం చేశారు.

ఇప్పటికీ గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను తీర్చకుండ పెండింగ్ లో పెట్టారని షర్మిల గుర్తుచేశారు. చంద్రబాబు మాటలు నమ్మవద్దు అని, ఆయన రాష్ట్రాన్ని ముంచే పని లో ఉన్నారని ఏద్దేవ చేశారు. వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలలోకి తీసుకెళ్ళి వారి చైతన్య పరచాలని పార్టీ కార్యకర్తలకు షర్మిల సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: