రాజకీయాల్లో ప్రత్యర్థులు ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పించుకోడం చాలా కామన్ విషయం. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాగబాబు కూడా ఇలాంటి విమర్శలు చేశారు. ఆయన నరసాపురం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రచారం లో భాగంగా లోకేశ్ బాబు పై ఆయన సైటైర్లు వేశారు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి గారితో లోకేశ్ నీ పోల్చారు. లోకేశ్ బాబు గారు మాట్లాడే మాటలు చాలా కామెడీ గా ఉంటాయి అని, దాని ముందు మా జబర్దస్త్ షో కూడా పనికి రాదు అంటూ చురకలు అంటించారు నాగబాబు.

అచ్చం రేలంగి గారి లాగే కామెడీ చేస్తున్నారు, వారిని అస్సలు తీసిపోవడం లేదంటూ ఏద్దేవ చేశారు నాగబాబు.లోకేష్‌తొ పాటు పనిలోపనిగా చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించారు నాగబాబు. చంద్రబాబుకి మతిస్థిమితం తప్పిందని, దాంతో చిత్రవిచిత్రంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

తాను పోటీకి కొత్త అయినా రాజకీయాలకు కొత్త కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన హవా చూపిస్తుందని చెప్పిన నాగబాబు.. నరసాపురం నుంచి తాను ఎంపీగా గెలవబోతున్నట్లు ప్రకటించారు.అలాగే ఈలి నాని పై కూడా తనదైన శైలిలో కామెంట్లు చేశారు. నాని కి అసలు నవ్వడమే రాదని అంటూ పంచులు వేస్తూ తనలోని పొలిటీషియన్ కోణాన్ని నాగబాబు బయటపెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: