ఎన్నికల ప్రచారంలో వైసీపీ పార్టీ అధినేత జగన్ టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కొడుకు నారా లోకేష్ పై సంచలన కామెంట్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని జాబు వస్తే బాబు రావాలని హామీ ఇచ్చి తన కొడుకు నారా లోకేష్ కి జాబు వచ్చేలా చేసి ఆంధ్ర ప్రదేశ్ యువతీ యువకులను చంద్రబాబు మోసం చేశారని కనీసం జయంతి వర్ధంతి కూడా తేడా తెలియని నారా లోకేష్ కి ప్రజలపై మూడు శాఖలకు మంత్రిగా చేసి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులపై మరియు చంద్రబాబు పై నారా లోకేష్ పై సంచలన కామెంట్ చేశారు జగన్.


దారుణంగా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు కి రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని అధికారం కోసం మరిన్ని మోసాలు చేయడానికి కూడా చంద్రబాబు రెడీగా ఉన్నారని తాను అవినీతి చేసి సంపాదించిన సొమ్మును రాబోయే రోజుల్లో అధికారం సంపాదించడం కోసం మూటలు మూటలు గా గ్రామాలకు ప్రజలకు పంచుతూ మళ్లీ అధికారంలోకి రావటానికి..ప్రయత్నాలు జరుపుతున్నారని జగన్ పేర్కొన్నారు.


ఏది ఏమైనా ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు ఆడిన డ్రామా లు కుట్రలు మీకు కూడా తెలుసు కాబట్టి రాబోయే ఎన్నికల్లో మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకున్ని వైసిపి పార్టీని గెలిపించుకొని రాష్ట్రానికి న్యాయబద్ధంగా విభజన హామీలను కేంద్రం నుండి తెచ్చుకుందామని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: