ఆంధ్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ల మధ్య పొలిటికల్ వార్ చాలా తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు శృతి మించుతున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్సార్సీపి పార్టీకి చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మరియు మంత్రి శాఖ గా ఉన్న వ్యవసాయ రంగంలో అడ్డగోలుగా సంపాదించారని ఆరోపణలు చేశారు.


ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెరైటీ కి అండగా నిలవాల్సిన సమయంలో రైతులను మోసం చేస్తూ అనేకమంది భూములను లాక్కున్నారని ఆరోపించారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి రాబోయే ఎన్నికలలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇదే క్రమంలో సోమిరెడ్డి మాట్లాడుతూ గతంలో కేసులో ఉన్న సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కాకాని ఇప్పుడు వచ్చి నీతి కబుర్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలకు ఎవరు ఏమిటో తెలుసు అంటూ పేర్కొన్నారు. మొత్తంమీద నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు చంద్రమోహన్ రెడ్డి ల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకోవడంతో నెల్లూరు రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: