ఎన్నికల ముందు చంద్రబాబు సంక్షేమ పథకాలతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎన్నికల రెండు నెలల ముందు టీడీపీ పార్టీ వరాల జల్లు కురిపించింది. అయితే నిరుద్యోగ భృతికి యువనేస్తం అంటూ కొత్త పేరు తగిలించేసి నిరుద్యోగులకు నెలకు రూ.1000 చొప్పున అందించనున్నట్లు ప్రకటించింది. ఎన్నికలు మరింత సమీపిస్తున్నాయనగా ఈ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచుతున్నట్లుగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వచ్చేనాటికి రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కోడ్ అమల్లో లేని ఆరు జిల్లాల్లో అమలు చేసింది.


తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిపోవడం ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేయడం జరిగింది. అయితే యువనేస్తం మొత్తం పెంపును ముందే ప్రకటించామని ఇప్పుడు దానిని అమలు చేయనున్నట్లు టీడీపీ సర్కారు ప్రకటించడంతో పాటుగా ఎన్నికల సంఘం అనుమతి ప్రస్తావననే పక్కనపెట్టేసి అమలు చేసేందుకు సిద్ధమైపోయింది. దీనిపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో యువనేస్తం పెంపు కుదరదని తేల్చేసింది. 


ఈ ప్రకటన టీడీపీకి షాకివ్వగా... ఇకపై టీడీపీ సర్కారు ఇటీవల ప్రకటించిన పలు పథకాలకు కూడా బ్రేకులు పడే అవకాశాలు లేకపో్లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకు టీడీపీ వేసిన ప్లాన్ అసలు ఉద్దేశాన్ని ఈసీ గుర్తించిందనే చెప్పక తప్పదు. యువనేస్తం మాదిరిగానే... పసుపు కుంకుమ - అన్నదాతా సుఖీభవ - డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్ల పంపిణీ తదితరాలకు కూడా బ్రేకులు పడిపోయినట్టుగానే తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టే దిశగా సాగుతున్న టీడీపీ పథకాలకు వరుసగా బ్రేకులు పడిపోవడం ఖాయమేనన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: