ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఇప్పుడు ఎన్నికల వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 11 వ తారీకున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరిగే ఎన్నికలలో గెలుస్తారా లేదా అన్న సందిగ్ధంలో ఉన్న రాజకీయ నేతలు తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి జ్యోతిష్కులను ఆశ్రయిస్తున్నారు.


ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు మరోపక్క పూజలు పురస్కారాలు కూడా చేస్తూ రాబోయే ఎన్నికలలో గెలిచి ఎలాగైనా అధికారం సంపాదించి సమాజంలో ప్రజలను పాలించే విధంగా తమ జాతకం ఏ విధంగా ఉంటుందో వంటి విషయాలను ముందే తెలుసుకొని దోషాలుంటే వాటిని కడుగు కోవటానికి ప్రముఖ జ్యోతిష్యులను ఆశ్రయిస్తూ పూజలకు మరియు దోషం పోయే కార్యక్రమాలకు పునుకుంటున్నారు రాజకీయ నేతలు.


ఇప్పటికే ఏపిలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అని నేతలు పండితులు, జ్యోతిష్యుల వద్దకు వెళ్లి తమ భవిష్యత్ ఏంటో చూపించుకుంటున్నారు.  కొంత మంది అంజనాలు..గవ్వలతో నేతల భవిష్యత్ చెబుతున్నారు. మొత్తంమీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జ్యోతిష్యులు రాజకీయ నేతలకు భవిష్యత్తు చెబుతూ వారి సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: