ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ త‌మ ప్ర‌చార స‌భ‌ల్లో ఈ అంశాన్నే ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేస్తోంది. జాతీయ పార్టీ పెడ‌తాన‌ని పార్టీ ర‌థ‌సార‌థి కేటీఆ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా త‌మ ఫ్రంట్‌లో ఎవ‌రెవ‌రు ఉంటారో ప్ర‌క‌టించారు. జాతీయ స్థాయిలో మమత, అఖిలేశ్‌, నవీన్‌ పట్నాయక్‌ తమతో కలిసి పనిచేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.  వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగమేనని కేటీఆర్ తెలిపారు. నర్సంపేటలో  లోక్ సభ ఎన్నికల ప్రచార రోడ్ షోలో కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.


కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ కు లాభం.. బీజేపీ గెలిస్తే మోడీకి లాభం.. కానీ టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణకు లాభం జరుగుతుందని కేటీఆర్ చెప్పారు. ఢిల్లీకి గులాంలుగా ఉండేవాళ్లను గెలిపించొద్దని కోరారు. ఢిల్లీని శాసించేవారికే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.  16 మంది టీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తే…. మరో 150 మంది ఢిల్లీలో మనతో కూటమి కడతారని అన్నారు. కేంద్రం మెడలు వంచి.. నిధులు తెచ్చి బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నదే నిజమైతే… ఈ 70 ఏళ్లలో ఎందుకు అది జరగలేదని కేటీఆర్ప్ర శ్నించారు . రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వమే అన్నారు. జ‌గ‌న్‌, మ‌మ‌తా, నితీశ్‌ మద్దతుతో 150 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని, ఆ బలంతో కేంద్రాన్ని శాసించే స్థాయికి వెళ్తామని అన్నారు.  ఎన్డీయేకు 150 నుంచి 160 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌కు 100 సీట్లు కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌, భాజపా అంటే పడనోళ్లు చాలా మంది ఉన్నారన్నారు. 


తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే గులాబీ జెండా పార్లమెంట్‌లో ఎగరాలని కేటీఆర్ అన్నారు. “రూ.80 వేల కోట్లతో కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరితే ఇవ్వలేదు.  నీతి ఆయోగ్ సిఫార్సు చేసి రూ.24 వేల కోట్లు మిషన్ కాకతీయ,  భగీరథ కోసం ఇవ్వమంటే.. మోడీ 24 పైసలు కూడా ఇవ్వలేదు. మన వాళ్లు గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడి ఇవన్నీ సాధిస్తారు. మందిరాలు, మసీదులు, మతాల పేరిట ప్రజలను  విభజించే వారిని నమ్మొద్దు. చౌకీదార్, టేకేదార్లు మనకొద్దు. కేసీఆర్ లాంటి దిల్ దార్ జిమ్మేదార్ లాంటి నేత కావాలి. ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం. మహబూబాబాద్ అభ్యర్థి మాలోత్ కవితను అఖండ మెజార్టీతో గెలిపించండి” అని కేటీఆర్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: