ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా ఇటీవల వైసీపీ పార్టీలో చేరిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత సినీనటుడు మోహన్ బాబు ప్రస్తుత రాజకీయాల గురించి మరియు చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో జగన్ ని దొంగ గా మరియు దోచుకునే వాడిగా చంద్రబాబు గతంలో అనేక ప్రయత్నాలు చేశారని కానీ జగన్ చాలా నీతిమంతుడని జగన్ కి చంద్రబాబు అసలు పోలికే ఉండదు అని స్పష్టం చేశారు.


ముఖ్యంగా జగన్ పై పెట్టిన కేసులు అవి అన్నీ రాజకీయపరమైనవి అని వాటిలో వాస్తవం లేదని అన్నారు. చంద్రబాబు పై ఉన్న కేసులు మొత్తం స్పష్టమైన ఆధారాలతో ఉన్నవి అని అంతేకాకుండా చంద్రబాబు చుట్టూ ఉన్నవాళ్లంతా దొంగలే అంటూ సంచలన కామెంట్ చేశారు మోహన్ బాబు.


తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుండి చంద్రబాబు కంటే ముందే నేను ఉన్నానని.. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం లోకి వచ్చారని అసలు చంద్రబాబు ది కాంగ్రెస్ పార్టీ అని కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు ఆయన మామయ్య దగ్గర నుండి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కుని నందమూరి కుటుంబ సభ్యులను నోరెత్తకుండా చేసి మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: