చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ అను నిత్యం కామెడీ చేస్తూ ఇంకా నవ్వుల పాలవుతున్నారు. మంగళగిరిలో కామెడీషో ను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దీనితో తెలుగు తమ్ములు ఏం చేయాలో అర్ధం కావటం లేదు. ఏప్రిల్ తొమ్మిదో తేదీన పోలింగ్ అని తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించినా నారా లోకేష్ బాబు విషయంలో ఆయన వీరాభిమానులు కవర్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతూ ఉంటే, వాళ్ల పాలిట మరోటి వదిలాడాయన. ఈ సారి కౌంటింగ్ విషయంలో. 'మార్చి ఇరవై మూడో తేదీన కౌంటింగ్ అయిపోతే ఎన్నికల కోడ్ పోతుంది..' అని చంద్రబాబు నాయుడు తనయుడు సెలవిచ్చారు!


మార్చి ఇరవై మూడో తేదీన కౌంటింగ్ ఏమిటి? అని జనాలు బుర్రలు గోక్కోవచ్చు గాక. వారితో లోకేష్ కు పని లేదు. తను చెప్పాలనుకున్నది ఆయన చెబుతారంతే. మే ఇరవై మూడో తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దేశ వ్యాప్తంగా ఒకే రోజు జరగనుంది. అయితే లోకేష్ మాత్రం మార్చి ఇరవై మూడో తేదీన కౌంటింగ్ అని ప్రకటించేశారు. ఇంతకీ ఏ మార్చి ఇరవై మూడు? వచ్చే ఏడాదా? అది లోకేషే చెప్పాలి.


ఎందుకంటే..  ఆల్రెడీ మనం మార్చి నెలాఖరుకు వచ్చేశాం. మార్చి ఇరవై మూడో తేదీ ఆల్రెడీ గడిచిపోయింది. ఇక వచ్చే ఏడాది మార్చి ఇరవై మూడు మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు కదా.. నారా లోకేష్ బాబును మంగళగిరి మాలోకం అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నది! పోలింగ్ డేటు విషయంలోనూ తడబాటే, కౌంటింగ్ డేట్ విషయంలోనూ తడబాటే. ఇంకా ప్రచారం పది రోజుల పైనే ఉంది.. ఇంతలో లోకేష్ బాబు ఇంకా ఏమేం మాట్లాడతారో! ఇంకా ఎంతలా కామెడీని పండిస్తారో! వినోదానికి అయితే ఢోకా లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: