నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల ఓ మీడియా సంస్థ ప్రతినిధులపై చేయి చేసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలయ్య తీరును ఓ సీనియర్ జర్నలిస్టు తీవ్ర పదజాలంతో విమర్శించారు. తామేదో దైవాంససంభూతుల్లా ఫీలైతే జనం తగినబుద్ది చెబుతారని జర్నలిస్ట్ సాయి మండిపడ్డారు. 


తాటతీస్తా.. బాంబులేస్తా.. నరికిపోగులు పెడతా..అంటూ బాలయ్య రెచ్చిపోవడాన్ని సాయి తీవ్రంగా గర్హించారు.. జనలంతా వెర్రోళ్లా.. లేక వారి ప్రాణాలు మీకేమైనా రాసిచ్చారా అంటూ కామెంట్ చేశారు. అభిమానాన్ని చేతగాని తనంగా ఫీలవకూడదన్నారు. 

ప్రజలు చూపే అభిమానానికి తగిన గౌరవం తెచ్చుకోవాలని.. అభిమానుల్ని చూసి అహంకారం ఫీలైతే.. మహామహులే మట్టికరిచారని గుర్తు చేశారు. అధికారంలో ఉంటే ఎలాగైనా మాట్లాడవచ్చనుకోవడం సరికాదన్నారు. బాంబులు వేస్తామన్నారుగా వచ్చి వేసి చూపించడని సవాల్ విసిరారు..

అణకువ లేకపోయినా పరవాలేదు.. అహంకారం ఉండకూడదన్నారు. బాధ్యత లేకపోయినా పరావాలేదు.. బాధ్యతారాహిత్యంగా ఉండకూడదు.. దీనిపై బాలయ్య పునరాలోచించుకోకపోతే భవిష్యత్ తరాలు క్షమించబోవన్నారు జర్నలిస్ట్ సాయి. బాలయ్య వీడియో వైరల్ కావడంతో అసలే ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం వస్తుందని భావించిన బాలయ్య ఓ ప్రకటనలో క్షమాపణ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: