ఏపీ సీఎం చంద్రబాబు అనగానే సీరియస్ ఫేస్ గుర్తుకువస్తుంది. రాజకీయ వ్యూహాలతోనో..పాలనాపరమైన అంశాలపైనో ఆలోచిస్తున్న రూపమే మదిలో మెదులుతుంది. పని పని పని.. అంటూ తాను నిద్రపోకుండా.. ఇతరులను నిద్రపోకుండా చేస్తారని చంద్రబాబుపై అధికారుల్లో ఓ టాక్ కూడా ఉంది. 


అలాంటి చంద్రబాబు.. తాజాగా ఓ పాటకు స్టెప్పులు వేశారు. హుషారుగా కాలు కదిపారు. ఈ చిత్రమైన సన్నివేశం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగింది. ఈ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ఉత్సాహంగా కనిపించారు. 

ఆయన ప్రసంగించేందుకు  వేదికపైకి ఎక్కుతున్న సమయంలో ఆపదలో గట్టెక్కించే నాయకుడు.. సీఎం చంద్రబాబు నాయుడేఅనే పాట ప్లే అవుతోంది. ఈ పాట విన్న చంద్రబాబులో జోష్ పెరిగింది. హుషారుగా చేతులూపుతూ స్టెప్పులేశారు. పాట వస్తున్నంతసేపు చంద్రబాబు చేతులు, కాళ్లు కదుపుతూ జనాల్లో ఉత్సాహం నింపారు. 

చంద్రబాబు స్టెప్పులు చూసిన అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ తర్వాత తేరుకుని కేరింతలు కొట్టారు. చంద్రబాబు స్టెప్పులు వేసే అరుదైన దృశ్యాన్ని చూసి జనం ఆనందించారు.  టీడీపీ సభలకు పోటెత్తుతున్న జనాన్ని చూసి చంద్రబాబులో జోష్ పెరిగిందని టీడీపీ నేతలు సంతోషపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: