టీడీపీ యామిని ఒక స్త్రీ అయిఉండి కూడా భరి తెగించి వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. ఇది వరకే పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పవన్ కు మల్లి పూలు నలపడం తప్ప ఏమొచ్చు అని వ్యాఖ్యానించడం తో అప్పుడు జనసేన శ్రేణులు భగ్గుమన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ తల్లి గారి అయిన విజయమ్మ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 


విజయమ్మ గారు తానూ ఆదర్శ తల్లి మాదిరిగా వచ్చి నా బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతుందని, మీ కొడుకు ఆంధ్ర ప్రజలకు ఏం చేస్తాడని అడుగుతున్నారని, కుటుంబం మొత్తం మెంటల్ గా తేడా ఉన్నట్టుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా కుటుంబం మొత్తం వలస పక్షుల మాదిరిగా వస్తున్నారని తన నోటి దూలను బయటి పెట్టింది. నీ కొడుకు మీద ప్రేమ పుత్ర వాత్సల్యం ఉంటే మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పింది. 


అయితే టీడీపీ యామిని వ్యాఖ్యల పట్ల వైసీపీ భగ్గుమంటున్నారు. యామిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని లేని పక్షం లో ఆంధ్ర ప్రజలే తమకు తగిన బుద్ది చెబుతారని చెప్పారు. అయితే యామిని వ్యాఖ్యలు టీడీపీ అధి నాయకత్వం మేరకే వచ్చాయని అందరూ చెబుతున్నారు. ఎందుకంటే ఒక కులం మీద అదే కులం కు చెందిన నేతల చేత మాట్లాడించడం .. అలాగే మహిళల మీద మహిళల చేత వ్యాఖ్యలు చేయించడం చంద్రబాబుకు కొత్తేమి కాదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: