టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై మరోసారి నిప్పులుచేరిగారు వైసీపీ నేత మోహన్ బాబు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన తాజాగా విజయవాడ వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారిని మోసం చేసి తెలుగుదేంపార్టీనీ లాక్కున్నావు అంటూ ఆయన ధ్వజమెత్తరు. హరికృష్ణ కుంటుంబానికి నువ్వేమి మంచి చేశావో చెప్పాలి అన్నారు. జగన్ పై అక్రమంగా కేసులను పెట్టించి వాటిని ఇప్పటివరకు కూడా నిరుపించలేక పోయావు అంటు మండిపడ్డారు.

జగన్ కేసుల విషయం మాట్లాడే ముందు తన కేసులు ఎన్ని ఉన్నాయో చెప్పాలి అన్నారు. వాటిని అధికారం లో ఉండి బయటకు రాకుండా తమ దగ్గర ఉన్న మంత్రులతో పెండింగ్ లో పెట్టించరంటు విమర్శించారు. చంద్రబాబు చేసిన కుట్రలు తనకు తెలుసని, వైస్రాయ్ హోటల్ విషయాలను గుర్తుచేశారు. చంద్రబాబు కంటే  తానే ముందు గా తెలుగుదేశం పార్టీలో చేరానని ఆయన అన్నారు.

అలాగే ఎదుటివారు బాగుంటే ఓర్వ లేని స్వభావం చంద్రబాబుది అని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే రాష్ట్రాన్ని నట్టేట ముంచుతాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఆలోచించి వైసీపీ కి ఓటు వేయాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృధి వైఎస్ జగన్ తోనే సాధ్యం, అని అందరం  ఆయనను కలిసి గెలిపించుకుందాం అని పిలుపనిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: