అధికార దాహానికి ఇంగితం ఉండదు. ప్రత్యర్ధినే కుతంత్ర రాజకీయాలకు బలిచేయటానికి కరుణను దయను సమూలంగా వదిలెయ్యగలరు. గుంటూరు జిల్లా మంగళగిరి లో ఇటీవలే గృహప్రవేశం చేసారు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి. అయితే అక్కడ నివాసం ఉండకుండా వెనువెంటనే హైదరాబాద్ కు వెళ్లిపోయారు. దీనిపై అధికార తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది.
పెద్ద ఎత్తున్న పార్టీలో చేరికలు జరుగుతున్నాయి కనుకే జగన్మోహనరెడ్డి హైదరాబాద్ వెళ్లారని ప్రచారం జరిగినా దాని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే వైఎస్ జగన్మోహనరెడ్డి అర్థాంతరంగా కొత్తగా కట్టుకున్న ఇంట్లో నివాసం కొనసాగించటం మానేసి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.
మంగళగిరి ఇంటి నిర్మాణం జరిగేటప్పుడే ఆ ఆవరణ చుట్టుపక్కల హైపవర్ ఫోన్ ఇంటర్సెప్టర్లు ఉన్నట్టు గుర్తించారని అంటున్నారు. వీటి ద్వారా కొంత దూరంలో ఉన్న లక్ష్యం చేసిన ఫోన్లకు ఇన్ కమింగ్ కాల్స్, ఔట్ గోయింగ్ కాల్స్ అన్నిటినీ ట్రాక్ చేసి వినొచ్చు. రికార్డు చేయొచ్చు. వైసిపి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు దీన్ని గుర్తించి జగన్మోహనరెడ్డిని అప్రమత్తం చేయడంతో, ఆయన తన కార్యకలాపాలను హైదరాబాద్ నుండి నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
హైపవర్ ఫోన్ ఇంటర్సెప్టర్లు లాంటి ఇంకా అనేక పరికరాలను చుట్టు పక్కల చాలా ఇన్స్టాల్ చేసి ఉన్నాయని అంటున్నారు. ప్రతిపక్షనేత కదలికలను కార్య క్రమాలను తెలుసు కునేందుకు ప్రత్యర్థులు వేసిన ఈ ప్లాన్ ను వైఎస్ జగన్మోహనరెడ్డి ఆయన సైన్యం పూర్తిగా వైఫల్యం చేసారన్నమాట.