ఏపీలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోయినా, రాష్ట్రమంతా ఆ ఫీవర్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమాలో ఎన్నో విస్తుపరిచే నిజాలను నిర్భయంగా చూపించిన రామ్ గోపాల్ వర్మ, దాని విడుదల ఆంధ్ర రాష్ట్రంలో ఆపేసిన తరువాత ఒక ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

ఆయనను ముందు సినిమాలలో లాగా డైరెక్ట్ గా పాత్రలను ఎందుకు కలవకుండా స్టోరీ రాసుకున్నారు అని ప్రశ్నించగా, ఒక వేళ ఆయన చంద్ర బాబుని, లేదా అతని సన్నిహితులను కలిసినా వారికి అనుకూలంగా చెప్పుకుంటారు అని అన్నారు. బాలకృష్ణ ముందు బయోపిక్ తనతోనే తీద్దాం అని అనుకున్నాడు అని, అయితే లక్ష్మీ పార్వతి పాత్ర పెట్టేందుకు ఒప్పుకోక పోవడంతో తాను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ఇక పోతే జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా ఈ విషయం గురించి మాట్లాడారు అని అడగగా, ఎవరు తనకు ఏమి చెప్పినా, కచ్చితంగా నిజాలు ఉన్నవి ఉన్నట్లు తాను చూపించాడని ఆర్జీవీ అన్నారు. అయినా ఆ కథ జరిగేటప్పుడు జూ.ఎన్టీఆర్ చిన్నపిల్లవాడు అని, ఆయనకు మరొకరు చెప్తే తెలుసుకోవడం తప్ప నిజం తెలిసే అవకాశమే లేదని రామ్ గోపాల్ వర్మ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: