కేసీఆర్ కు సెంటిమెంట్ ల మీద, పూజలు హోమాల మీద ఎంతో నమ్మకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారు. జగన్ రాజశ్యామల యాగం చేయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో విజయం కోసం ఆయన ఈ యాగం చేయించారని తెలుస్తోంది. మార్చి 27న ప్రారంభమైన ఈ యాగం.. మార్చి 29న ముగిసింది.


నెల్లూరు జిల్లాలో ఈ యాగాన్ని నిర్వహించినట్టు సమాచారం. ఈ యాగం విషయాన్ని జగన్ కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. ఆ కుటుంబానికి సన్నిహితుడైన ఎంపీ ఒక్కరే ఈ యాగంలో పాల్గొన్నారు. యాగం జరిగిన విషయం బెంగళూరు మిర్రర్ ఆన్‌లైన్ ఎడిషన్లో కథనాన్ని ప్రచురించింది. విశాఖపట్నం శారాదాపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పర్యవేక్షణలో యాగం పూర్ణాహుతిని నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ యాగంలో జగన్ కుటుంబ సభ్యులెవరూ పాల్గొనలేదు.


జగన్ బదులు ప్రధాన రిత్వికులు వరుణ తీసుకొని ఈ యాగాన్ని పూర్తి చేశారు. ఈ యాగంలో మొత్తం 27 మంది రిత్వికులు పాల్గొన్నారు. రాజ్యశామల యాగాన్ని పూర్వకాలంలో రాజులు చేసేవారు. యుద్ధానికి వెళ్లే ముందు విజయ సిద్ధికోసం ఈ యాగం చేసేవారు. అష్టాదశ శక్తి పీఠాల్లో రాజ్యశామల  ఒకటి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు.. గత ఏడాది నవంబర్లో కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో రాజ్య శామల యాగం నిర్వహించారు. కేసీఆర్ సలహాతోనే జగన్ తాజాగా యాగం చేసినట్టు సమాచారం. వాస్తవానికి ఈ యాగాన్ని ముందే నిర్వహించాల్సింది. కానీ వివేకానంద రెడ్డి హత్య కారణంగా.. దశదిన కర్మలు ముగిశాక యాగాన్ని నిర్వహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: