ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు పాలిస్తా... ఇది జగన్ చెప్పే మాట. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం తలరాత మారుస్తా.. వైఎస్‌ ఆర్‌ తరహాలో రాజన్న రాజ్యం తెస్తా.. అంటూ ఉంటాడు జగన్. ప్రతి ఇంట్లోనూ వైఎస్సార్ ఫోటో పక్కన తన ఫోటో ఉండాలన్నది జగన్ చిరకాల వాంఛ.


అయితే ఈ మాటలు నిజమే అంటున్నాడో అఘోర బాబా. అరవింద్ అఘోరా అనే ఈయన ఇటీవల సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్నాడు. ఆ మధ్య వైఎస్‌ఆర్‌ తరహాలోనే జగన్‌ కూడా హఠాన్మరణం చెందుతాడని సంచలనం బయటపెట్టారు. 

ఆయన మాటలు వివాదాస్పదం కావడంతో మళ్లీ ఆయన తెరపైకి వచ్చారు. తన మాటలకు వివరణ ఇచ్చారు. జగన్‌ తండ్రి తరహాలోనే సీఎం అవుతారని.. ఆయన జీవితకాలం సీఎంగానే ఉంటారని.. చెప్పాడు అఘోరా బాబా. అంతే కాదు.. పదవిలో ఉండగానే జగన్ మరణిస్తారని తన మాటలను వివరించారు. 

మరి నిజంగా ఈ అఘోరాలను భవిష్యత్‌ దర్శించే శక్తులు ఉంటాయా.. ఈయన నిజమే చెబుతున్నాడా.. లేక పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్లు చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నిజానిజాలు కాలం చెప్పాల్సి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: