సినీ ప‌రిశ్ర‌మ‌కు మ‌రో ఇద్ద‌రు ప్ర‌ముఖులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి జై కొట్టారు. హైదరాబాద్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో సినీనటులు జీవిత, రాజశేఖర్‌లు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో జగన్‌ను రాజశేఖర్‌, జీవితలు కలిశారు. పలు అంశాలపై వారు జగన్‌తో చర్చించారు. అనంత‌రం వారు మీడియాతో వైఎస్ జ‌గ‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 


అనంత‌రం హీరో రాజశేఖర్ మీడియాతో మాట్లాడ‌తూ చాలా రోజుల తర్వాత జగన్‌ను కలిశానని, కొన్ని మనస్పర్థలు ఈరోజుతో మా మధ్యలో తొలిగాయన్నారు. ``అప్పట్లో నేను ఇమ్మెచ్యూర్ గా ప్రవర్తించాను. నాకు శత్రుత్వం లేదు, కానీ ఎందుకో మనస్పర్థలు ఉన్నాయి. అవి తొలగించుకోవడానికే జగన్ గారి దగ్గరకు వచ్చాను. అప్పట్లో జగన్ ఇప్పట్లో జగన్ వేరు. జగన్ చాలా లవబుల్ పర్సన్. వైఎస్సార్ సూపర్ డూపర్ అనేలా పని చేశారు. ఆరోగ్యశ్రీ, ఐటీ అన్నీ అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆ పులిబిడ్డ జగన్ కూడా ప్రజలకు ఆవిధంగానే పని చేస్తారు. పెద్దింటి బిడ్డలు ఉన్నట్లు జగన్ లేరు. సుఖపడాలని కోరిక ఆయనకు లేదు. ఆయనకు ఎప్పుడూ కష్టపడటమే తెలుసు. నేను ఆయనను కలవడం ఆలస్యమైంది. ఇప్పటికైనా ఆయనను కలవడమం సంతోషం అనిపిస్తుంది. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. చంద్రబాబుకి మూడు అవకాశాలు ఇచ్చాం, కానీ టీడీపీలో అవినీతి పెచ్చుమీరింది. జగన్ యంగ్ బ్లడ్, ఆయనతోనే బంగారు భవిష్యత్తు. ఆయనతో పాటే ఉండి ఆయన సీఎం అవడం వరకు కృషి చేస్తాం`` అని వెల్ల‌డించారు. 


జీవిత మాట్లాడుతూ, ఎన్నిక‌ల ముందు ఇచ్చే డబ్బలుకు, చీరలకు ఆశ పడొద్దని కోరారు. ``మన భవిష్యత్తు బాగుండేలా కృషి చేసే జగన్‌ని బలపరచాలి. జగన్ మహరాజుల బతకాల్సింది, రాత్రింబవళ్లు చెమటోడుస్తున్నాడు. ప్రజలు ఆయన గెలవాలనుకుంటున్నారు. కష్టపడకుండా కొడుకును సీఎం చేయాలనుకునే వారు మనకొద్దు. జగన్ లాంటి కష్టపడేవాళ్లు మనకు కావాలి. దొంగల వ‌లే ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయి`` అని వ్యాఖ్యానించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: