ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వైసీపీ పార్టీ రాబోయే ఎన్నికలలో విజయం గ్యారెంటీ అన్నట్టుగా దూసుకెళ్ళిపోతున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఆ పార్టీ అధినేత జగన్ వేస్తున్న వ్యూహాలకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి ముచ్చెమటలు పడుతున్నాయి ఏమీ చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు మరియు పొలిటికల్ విశ్లేషకులు ఇటీవల కామెంట్లు చేస్తున్నారు.


ఇదే క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో కూడా రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడం ఖాయమని అదేవిధంగా జగన్ ముఖ్యమంత్రి అని ఇప్పటికే ప్రజలు డిసైడైపోయారని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు..సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఇప్పటికే వైసిపి పార్టీ కి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరుతున్నారు.


ఈ క్రమంలో తాజాగా జీవిత రాజశేఖర్ లు లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి మరియు మంచి రోజులు ఆంధ్ర ప్రజలకు ఇస్తారని మీడియాకు తెలిపారు. పార్టీని క్లిష్ట సమయంలో జగన్ను అద్భుతమైన నాయకత్వాన్ని కనబరిచి ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడం నిజంగా ఆయన చేసిన కష్టానికి త్యాగానికి ఎదుర్కొనే ఇబ్బందులకు ప్రజలు అద్భుతంగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: