నెల్లిమర్ల నియోజకవర్గంలో నవరత్నాల ప్రచారం నిర్వహించారు నెల్లిమర్ల నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడ్దుకొండ అప్పలనాయుడు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో నియోజకవర్గంలో జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల పధకం గురించి ప్రజలకు తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.

శనివారం మండలంలోని గూడెపువలస గ్రామ పంచాయతీలో వెంపాడ పేట గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు కొండపు లక్ష్మణ్ రెడ్డి,కోల్లి రాంమూర్తి,కొండపు శ్రీనువాస రెడ్డి,దారపు అసిరప్ప రెడ్డి,మట్ట నరసింగ్ రావు,కొయ్య అప్పలరెడ్డి,దారపు రమణ రెడ్డి,దారపు రాజారావు,మట్ట రమేష్,సరగడ వెంకటేష్,మట్ట అసిరినాయుడు,కొండపు బంగారి రెడ్డి,వెంపాడ పాపరాజు తదితరులు పాల్గొన్నారు.

జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను గురించి ఇంటి ఇంటికి వెళ్లి వివరించారు. అలాగే ప్రజల దగ్గర నుండి కూడా వీటికి అశేష స్పందన లభించింది. అలాగే భోగాపురం మండలంలోని తూడె‌ం గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో అప్పలనాయుడు తో పాటు మండల కన్వీనర్ శ్రీ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి తదితర ముఖ్యనాయకులు పాల్గొని నవరత్నాలను గురించి తెలిపారు. ఈ నేపథ్యంలో కొవ్వాడ మాజీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చందక సత్యం 200 కుటుంబాలతో వైస్సార్సీపీ పార్టీ లో చేరారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని వారంతా కోరుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: