కే.ఏ.పాల్ పేరు తెలియని వాళ్ళు బహుశా ఉండరు అనుకుంటా. తనదైన శైలి లో కామెడీ చేస్తూ అందరిని నవ్విస్తూ ప్రచారం చేస్తుంటారు. అయితే నిన్న అమరావతి లో తమ బీ-ఫామ్‌లను కొట్టేశారు అంటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి ఫిర్యాదు చేశారు.

అటు నుంచి మీడియా మిత్రులతో మాట్లాడిన ఆయన టీడీపీ తో మేము పొత్తు లో ఉన్నాం అంటూ దుష్ప్రచారం జరుగుతుందని, అవన్నీ నిజాలు కావు అంటూ ఆయనే కొట్టి పారేశారు. అలాగే తాను టీడీపీ తోనే కాదు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము అంటు ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు చేస్తూ, చంద్రబాబు అధికారం కోసం ఎవరితోనైనా పొత్తుకు సై అంటారని ఆయన మళ్లీ బీజేపీతో కలిసిన ఆశ్చర్యపోన్కర్లేదు అంటు చంద్రబాబుకు చురకలు అంటించారు.

తనకు భద్రత లేదంటూ ఈసీని, డీజీపీని కోరానని అయితే ఇంకా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని వాపోయారు. మొన్న జరిగిన ప్రచారంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన చైన్ కొట్టేసిన విషయం మనకు తెలిసిందే. ఇలాంటి సంఘటనలు మళ్లీ ఎదురవకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: