క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది.  మంగళగిరిలో పుత్రరత్నం నారా లోకేష్ గెలుపు కోసం నానా అవస్తలు పడుతున్న విషయం వాస్తవం. ప్రచారం జరుగుతున్నపుడు లోకేష్ తన పాండిత్యం మొత్తాన్ని బయటపెట్టేసుకుంటున్నారు. దాంతో టిడిపి నేతలే తలలు పట్టుకుంటున్నారు. ఇదే విషయమై వైసిపి రాజ్యసభ సభ్యుడు  విజయసాయిరెడ్డి ఓ ఆసక్తికరమైన అంశాన్ని బయటపెట్టారు.

 

విజయసాయి ట్విట్టర్లో స్పందిస్తు, మంగళగిరిలో లోకేష్  గెలుపు విషయంలో చంద్రబాబు సీనియర్ నేతలపై మండిపోతున్నారట. లోకేష్ ను తాను విశాఖపట్నం భీమిలీలో పోటీ చేయిద్దామని అనుకుంటే సీనియర్లు కొందరు తప్పుదోవ పట్టించినట్లు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు విజయసాయి ట్వీటారు. మరి సీనియర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విజయసాయికి ఎలా తెలిసింది ?

 

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ చంద్రబాబులో అసహనం బయటపడుతుండటం కూడా ఒక ఉదాహరణా చెబుతున్నారు. లోకేష్ ఓటమి తప్పదని తెలిసిన తర్వాత చంద్రబాబులో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ రాజ్యసభ సభ్యుడు ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: