ప్రముఖ నటుడు, రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. ఆయనకు జగన్ మోహన్ రెడ్డికి మధ్య ఆమె వ్యత్యాసం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డిపై ఉన్నవన్నీ ఆరోపణలు అని, ఆయన మిగతా వారిలాగా, జనాలను కొట్టలేదని, ఫోన్ ట్యాపింగ్ లో పట్టుబడలేదని, డబ్బులు ఇచ్చి నాయకులను కొనుక్కొలేదని అన్నారు.

ఈ సందర్భంగా ఆమె పవన్ కి కూడా చురకలు అంటించారు. ఒక పార్టీతో రహస్యంగా పొత్తు పెట్టుకొని బయటకు వచ్చి జగన్ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె పవన్ కళ్యాణ్ ను విమర్శించారు. దీని వల్ల జగన్ ఓటమి చెందుతారని, అది మన రాష్ట్రానికే మంచిది కాదని ఆమె అన్నారు. ఇక పోతే సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు రైతులకి 5000 రూపాయలు ఇస్తానని ప్రకటించడం కేవలం రాజకీయ లబ్ది కోసమే అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

ఇక పోతే 2014లో డ్వాక్రా రుణాలు తీరుస్తా అని మభ్యపెట్టి చంద్ర బాబు ఇప్పుడు నెల నెలా డబ్బులు అకౌంట లోకి వేస్తాను అని చెప్పడం చూస్తుంటే అవి బ్యాంక్ వాళ్ళే లోన్ డబ్బులు కింద ఉంచేసుకుంటారని ఆమె అన్నారు. జగన్ అధికారంలోకి వస్టే ఇంటింటికీ వచ్చి చేతికి రుణం తీర్చమని డబ్బులు ఇస్తారని, అదే బాబుకి, ప్రియతమ నాయకుడు జగన్ మధ్య తేడా అని ఆమె అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: