మన రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాకు ఉన్నంత ప్రాముఖ్యత మరే జిల్లాకు లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇక్కడ చాలా కాలంగా టీడీపీ జెండానే ఎగురుతూ వచ్చింది. దానికి కారణాలు లేకపోలేదు. దాదాపు తరాలుగా ఈ జిల్లాలో కొన్ని కుటుంబాలు తెదేపా ఉనికిని నిలుపుతూ వస్తున్నారు.

పరిటాల ఫ్యామిలీకి ఇక్కడ దాదాపు ఎదురు లేదనే చెప్పాలి. అలాగే జేసీ దివాకరరెడ్డి కూడా తెదేపా కావలి కాస్తూ ఉన్నారనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు తెదేపా పునాదులు కదిలే అవకాశం ఉందట. ఆ సర్వే ప్రకారం 14 నియోజకవర్గాల్లో తెదేపా కేవలం 4 నియోజకవర్గాల్లో ముందంజలో ఉందని వారి వివరణ.

కానీ వైసీపీ మాత్రం ఏకంగా 10 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసెందుకు సిద్ధంగా ఉందట. ఇక పోతే జనసేన మాత్రం మరీ కష్టపడితే కేవలం ఒక్క సీటు సంపాదించగలదని అన్నారు. అదే గనుక జరిగితే రానున్న రోజుల్లో జగన్ దూకుడుకి కళ్లెం వేసేవారు లేనట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: