ఏప్రిల్ 11న జరుగనున్న ఏపి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఈసారి అందరం జగన్ కు ఓటేద్దామని తన తరపున పిలుపునిచ్చారు దర్శకుడు ఎస్వి కృష్ణా రెడ్డి. టాలీవుడ్ లో ఎన్నో మంచి సినిమాలు చేసి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కృష్ణా రెడ్డి జగన్ ఓ అద్భుత శక్తిగా మారాడని అన్నారు.


ఒక వ్యక్తి యొక్క శక్తిని మేము చూశాం.. చూసినప్పుడు అది మీతో పంచుకోవాలని అనిపించింది అందుకే ఇలా జగన్ ను గెలిపించాలని జగన్ వస్తే బాగుంటుందని మీ ముందుకు వచ్చామని అన్నారు ఎస్వి కృష్ణా రెడ్డి. ఆయన పట్టుదల చూసి ఆశ్చర్యమేసిందని నాలుగున్నర సంవత్సరాలుగా 3643 కిలో మీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రతి వ్యక్తి యొక్క బాధ, కష్టం, అవసరం అన్నిటిని గురించి తెలుసుకుని వాళ్లని అర్ధం చేసుకున్నారు వైఎస్ జగన్.


ఎర్రటి ఎండలో ఆయన అలా తిరగడం తమకి ఆశ్చర్యమేసిందని.. ఆయనకు ఉన్న రేంజ్ కు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. కాని ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వాళ్లను కాపాడాల్సిన అవసరం తనదే అంటూ ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని వంశం వారిది. అందుకే నవరత్నాల్లాంటి పథకాలతో ప్రజల కష్టాలు తీర్చేందుకు వస్తున్నారు.  


ఒక సందర్భంలో పాదయాత్ర టైంలో నేను తనతో ఉండగా ఓ మహిళ కుర్చిలో కూర్చుని ఆమె జగన్ ను చూసి అన్నా నువ్వే నా కష్టాలు తీర్చాలని అన్నది. అక్కడ ఆమె సమస్య తెలుసుకుని తన అసిస్టెంట్ తో 3 గంటల్లో ఆమె సమస్య సాల్వ్ చేశాడు జగన్. ఆ టైంలో జగన్ ను చూసి తన కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయని అన్నారు కృష్ణా రెడ్డి. జగన్ కు ఓటేసి గెలిపించి కష్టాలను దూరం చేసుకుందామని అన్నారు కృష్ణా రెడ్డి.      



మరింత సమాచారం తెలుసుకోండి: