ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారి కుమారుడు నారా లోకేష్ గారి మాటకారితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో బహిరంగ సభలలో నిండు ప్రజానీకం ముందు తప్పులు దొర్లించడం, వాళ్ళ పార్టీని పొరపాటున తిట్టేయడం చాలా సార్లు చూశాం. ఇప్పుడు ఆయన వాళ్ళ మామ గారు అయిన బుల్ బుల్ బాలయ్యనే దాటేసాడు.

అరకులో లోకేష్ మాట్లాడుతూ, చంద్ర బాబు నాయుడు ఇప్పుడు దేశంలోని ప్రధాన మంత్రిని నిలబెట్టే స్థాయిలో ఉన్నారని అనడంతో విస్తుపోవడం ప్రజల వంతు అయింది. అసలు లోక్ సభ సర్వేలు అన్నీ జగన్ క్లీన్ స్వీప్ అని చెప్తుంటే మన లోకేష్ మాత్రం ఏకంగా ప్రధానిని నిలబెట్టడం ఎంటి అని అనుకున్నారు. మళ్లీ ప్రత్యేక హోదా కూడా తీసుకొని వచ్చేది చంద్రబాబు అని ఆయాన అనడం వారికి "యూ టర్న్" ఎపిసోడ్ గుర్తుకు తెచ్చింది.

మరో వైపు ఇంకొక అల్లుడు ఏకంగా మన ఐటీ మంత్రి లోకేష్ నే పొగుడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్లెలను పైకి లేపడానికి పట్టణాన్ని దారుణంగా కించపరచడం అనేది అక్కడ ఆయన యొక్క అనుభవలేమిని తెలియజేసింది. ఇలా అల్లుళ్ళు ఇద్దరూ ఏకంగా బాలయ్య బాబుని మించిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: