ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారానికి వస్తున్న జనం చూసి ప్రత్యర్థి పార్టీల రాజకీయ నేతలకు మతిపోతుంది. మరియు అదే విధంగా జగన్ సభకి వచ్చిన జనాన్ని చూసి ఇటీవల జాతీయ మీడియా ఛానల్ రిపోర్టర్ కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రి మీరేనా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం ఇప్పుడు ఏపీ పొలిటికల్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.


ఇదిలా ఉండగా తాజాగా జగన్ ఎస్ కోటలో మించిన ఎన్నికల ప్రచారానికి వచ్చిన జనం చూసి చాలామంది ఇది ఎస్ కోటలో అల్ టైమ్ రికార్డు అన్ని కామెంట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇక్కడ జరిగిన మహాసభలో జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఇచ్చిన హామీల పట్ల ప్రజలు ఎంతగానో సంతోష్ ఇచ్చినట్లు సమాచారం.


ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో అధికార పార్టీ టీడీపీ ప్రజలను ప్రలోభ పెట్టడానికి మూటలు మూటలు డబ్బులు గ్రామాలకు తరలిస్తారని అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం గతంలో లాగా మోసపోకుండా మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయాలని రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఏం జరిగింది మరియు రాష్ట్రాన్ని ఏ విధంగా అవినీతి మయం చేశారో వంటి విషయాలను గుర్తు పెట్టుకొని  ఓటు వేయాలని పిలుపునిచ్చారు జగన్. మొత్తం మీద ఎస్ కోటలో జగన్ సభకు వచ్చిన జనం చూసి చాలామంది రాజకీయ నేతలు ఆశ్చర్యపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: