ఏపి ఎలక్షన్స్ లో సిని గ్లామర్ కూడా క్రేజీగా మారింది.. ఒకప్పుడు అంతా టిడిపి సపోర్ట్ చేసిన సిని ప్రముఖులంతా బాబు కుట్రలు తెలుసుకుని ఇప్పుడు జగన్ వైపుకు వచ్చారు. అయితే కొందరు వైసిపిలో చేరడం వరకే తమ సపోర్ట్ అందిస్తుండగా ఏకంగా జగన్ కోసం ప్రచారంలో పాల్గొంటున్న వారు మరికొందరు ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకుంటే థర్టీ ఇయర్స్ పృధ్వి, ఆలి, పోసాని కృష్ణ మురళి వస్తారు.  


పృధ్వి రాజ్ ఏకంగా వైఎస్ జగన్ కోసం పార్టీ ప్రచారంలో కూడా పాల్గొంటున్నాడు. ఈరోజు ప్రచారంలో భాగంగా పృధ్వి రాజ్ చంద్రబాబు మోసాల గురించి కంపోజ్ చేసిన ఓ పాట పాడటమే కాదు స్టెప్పులేయడం కూడా జరిగింది. పృధ్వి రాజ్ అండ్ టీం జగన్ వస్తే ఏపి ప్రజల కష్టాలు తీరుతాయని చెబుతూనే మరోపక్క బాబు అక్రమాల గురించి ప్రస్థావించారు.   


ప్రచారంలో పృధ్వి పాడిన పాటలు.. వేసిన స్టెప్పులు వైసిపి నేతలు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపుతుంది. తెలుగు పరిశ్రమలో ఈమధ్య వైసిపిలో చేరికలు ఎక్కువయ్యాయి. ఇక ఎలక్షన్స్ ప్రచారంలో టిడిపి, వైసిపి రెండు పార్టీలు తమ ప్రచార జోరు పెంచారు. ఎలక్షన్స్ ఇంకా 10 రోజు మాత్రమే టైం ఉండటంతో ప్రచార పర్వాన్ని ఇంకాస్త స్పీడప్ చేశారు.


పృధ్వి రాజ్ ఫేమస్ డైలాగ్ అయిన అమ్మనీ బత్తాయో అంటూ కార్యకర్తల్లో జోరు పెంచారు. చంద్రబాబు 40 సంవత్సరాలుగ రాజకీయాల్లో ఉంటే తాను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని బాబు మీద విమర్శలు చేశారు పృధ్వి రాజ్. వైసిపి ప్రచారాల్లో సిని గ్లామర్ కు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: