రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబు దిట్ట.. ఈ విషయాన్నీ అంతా ఒప్పుకుంటుంటారు. అయితే ఆయన కొందరిని కావాలని రాజకీయ బలిపశువులుగా చేస్తుంటారని కూడా చెబుతుంటారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి బరిలో దిగిన నందమూరి సుహాసినే అందుకు ఉదాహరణ అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు. 


చంద్రబాబు హరికష్ణ కుటుంబాన్ని అన్నిసార్లూ వాడుకుని వదిలేశారని.. సుహాసిని విషయంలోనూ ఇదే జరిగిందన్నారాయన. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు సమయంలోనూ చంద్రబాబు హరికృష్ణను వాడుకుని వదిలేశారని.. కనీసం ఎమ్మెల్యే సీటు అడిగినా ఇవ్వలేదని గుర్తు చేశారు. 

మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో నందమూరి సుహాసిని కావాలనే ఓడిపోయే కూకట్ పల్లి సీటు ఇచ్చి చంద్రబాబు మోసం చేశాడన్నారు. తాను సీటు ఇచ్చినా సుహాసిని గెలవలేకపోయందన్న ప్రచారం చంద్రబాబు చేశారన్నారు నార్నే. అదే కొడుకు లోకేశ్‌ కు మాత్రం ఆంధ్రాలో మంగళగిరి ఇచ్చారని చెప్పుకొచ్చారు. 

ఇదే సుహాసినికి మంగళగిరి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంతే కాదు.. మంగళగిరిలో చేనేత నాయకులకు సీటు ఇస్తానని ఎప్పటి నుంచో చంద్రబాబు చెప్పిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. కొండ్రు కమలకు ఇస్తానని చెప్పిన చంద్రబాబు కొడుకు కోసం బీసీలను బలి చేశారని నార్నే శ్రీనివాస్ విమర్శించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: