ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీలో గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న విశాఖపట్టణం జిల్లాకు చెందిన సబ్బం హరి రాబోతున్న ఎన్నికల్లో టిడిపి పార్టీ నుండి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గాలి వేస్తున్న నేపథ్యంలో సబ్బం హరి తనకు తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకొంటూ సోషల్ మీడియాలో తెగ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి భీమిలి ప్రజలు తనని ఆధారఇస్తున్నట్లు ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.


అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు అధికారంలోకి రావటం ఖాయమని తెలుగుదేశం పార్టీ పట్ల ఆంధ్ర ప్రజలు ఎంతగానో సంతృప్తిగా ఉన్నారని ఇటీవల ఎన్నికల ముందు పార్టీలో చేరిన సబ్బం హరి సెల్ఫ్ డబ్బా మాటలు మాట్లాడుతూ విశాఖ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చంద్రబాబు అభివృద్ధి చేశారని ఇలా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గెలవడం కోసం నానా తంటాలు పడుతున్నారు అని అంటున్నారు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు.


అయితే ఒకసారి గమనిస్తే భీమిలి నియోజకవర్గంలో పట్టు ఉన్న అవంతి శ్రీనివాస్ ఈసారి రాబోయే ఎన్నికల్లో మాత్రం మళ్లీ మరొకసారి వైసిపి పార్టీ తరఫున భీమిలి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయం అని అంటున్నారు ఆ ప్రాంత ప్రజలు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న సబ్బం హరి ఇప్పుడు బయటకు వచ్చి సమస్యలు తీరుస్తా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తది అని చెప్పడం హాస్యాస్పదం అని కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద సబ్బం హరి మాటలు చూస్తుంటే వైసీపీ పార్టీ గెలుస్తుందన్న ఏడుపుతో విశాఖ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారని వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు సబ్బం హరి ఇచ్చిన ఇంటర్వ్యూ పై మండిపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: