దివంగత నేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి సతీమణి లక్ష్మీ పార్వతి వైసీపీ పార్టీ తరుపున ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పైన మరియు అతని కుమారుడు లోకేష్ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి నలభై ఏళ్ల ఆశయంగా మనకు ప్రతిబింబం అయితే, చంద్రబాబు కి నలభై ఏళ్ల దుష్ట రాజకీయాలు చేసిన అనుభవం ఉందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. వీరిద్దరిలో ఎవరిని ఎంచుకుంటారు అని అక్కడ ఉన్న ప్రజానీకాన్ని ఆమె అడిగారు.

బాబు ఒక జిత్తుల మారిన నక్క అని, ఆయన తన చిట్టెలుక అయిన నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నట్లు ఆమె తెలిపారు. తాను ఒకసారి లోకేష్ కి చెప్పానని... తాను పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం పేరు స్పష్టంగా పలికితే తన ఓటు మనవడైన నీకే వేస్తానని చెప్పినట్లు లక్ష్మీ పార్వతి తెలియజేశారు. అతను తెలుగు స్పష్టంగా మాట్లాడేందుకు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని ఆమె చెప్పి ఐ.టీ మినిస్టర్ పరువు తీసేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: