గుడివాడ నియోజకవర్గంలో పోరు తాలూకు వేడి తరా స్థాయికి చేరింది. తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ కి అక్కడి ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు. ఆయన ఆఫీస్ నుండి ఒక మహిళ గుడివాడలోని ఓటరుకి ఫోన్ చేసి తాను సర్వే తరుపున కాల్ చేస్తున్నట్లు తెలిపి చివరికి ఖంగుతినింది.

ముందుగా ఆ మహిళ గుడివాడ నుండి దేవినేని అవినాష్ పోతే చేస్తున్నారు అని తెలియజేసి తరువాత తెదేపా ప్రభుత్వం ఇన్ని రోజులు చేసిన సంక్షేమ పథకాల పేర్లు చెప్పుకొని డబ్బా కొట్టింది. తరువాత సదరు ఓటరు అమూల్యమైన ఓటు అవినాష్ కి వేయాల్సిందిగా కోరి, తమ ప్రాంతంలో సమస్యలు గురించి చెప్పమని అడిగింది.

దానికి ఆ వ్యక్తి అసలు ఈ దేవినేని అవినాష  ఎక్కడి ప్రాంతానికి చెందిన వాడు అని ప్రశ్నించారు. అసలు తన ప్రమేయం లేకుండా ఫోన్ నంబర్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించి, గుడివాడలో ఒక 30 వార్డుల లేదా ప్రాంతాల పేర్లు చెప్తే తాను అతనికి ఓటు వేస్తానని ఘాటుగా బదులిచ్చారు. దీనికి ఆ కాల్ సెంటర్ అమ్మాయి దగ్గర సమాధానం లేకుండా పోయింది. చివరికి కొడాలి నాని తప్ప ఇంకెవ్వరూ గుడివాడలో గెలవలేరని మీ దేవినేని అవినాష్ కు చెప్పమని బదులిచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: