తన కొడుకుని మంగళగిరి నియోజకవర్గంలో నిలబెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గెలుపు మీద చాలా ఆశలే ఉన్నాయి. ఎన్నో తర్జనభర్జనల తరువాత లోకేష్ కి ఈ నియోజకవర్గం ఖరారు చేశారు. అయితే ఆ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం చూసి షాక్ లో ఉన్నారు చంద్రబాబు.

సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ పని తీరు పట్ల వారు బాగా సంతృప్తి గా ఉన్నారు. లోకేష్ కు ఏమీ తెలుసు, కనీసం స్పష్టం గా మాట్లాడలేని నాయకుడికి మమ్మల్ని ఎలా అంట గడతారు అని ఆ ప్రాంతంలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా వారికి ఏమైనా సమస్యలు ఉంటే సీ.ఎం కొడుకు దగ్గరకు ఎలా వెళ్లాలి అని ఇంకొక బాధ. అసలు అపాయింట్మెంట్ ఎలా దొరుకుతుంది అని అడుగుతున్నారు.

పైగా ఈ అయిదేళ్లలో రామ కృష్ణ అలియాస్ ఆర్కే చేసిన అభివృద్ధి అంతా ఇంతా కాదు. కాబట్టి మంగళగిర ప్రజలంతా నారా లోకేష్ కన్నా వాళ్ళ ప్రియతమ నాయకుడు ఆర్కే వైపే ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: