వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అశేష జన సందోహం నీరాజనాలు పడుతుంది. అలాగే వారి అభిమానానికి అసలు హద్దులు ఉండవనే చెప్పాలి. తిరువూరు లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది.

ఆయనను ఒక నాయకుడు పరిచయం చేస్తున్న సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త, పీవీపీ సినిమా అధినేత అయిన పొట్లూరి వర ప్రసాద్ తన అభిమానాన్ని ఆపుకోలేక ఆయనకు ముద్దు పెట్టారు. తరువాత జగన్ ఆయనతో కొంచెం సేపు ముచ్చటించి ప్రజలకు అభివాదం చేశారు. 

పొట్లూరి వరప్రసాద్ ముందు జనసేన పార్టీ లో చేరేందుకు ఆసక్తి చూపించినా కూడా అక్కడ పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు. ఈ వీడియో వైరల్ కావడంతో పాటు, ఆయన అభిమానంగా జగన్ కు ముద్దు పెట్టిన సమయంలో అక్కడ ప్రజలు మరింత ఉత్సాహంతో ఊగిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: