70 పై బడిన వయస్సు, మూడు సార్లు ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ జీవితం, కోట్ల విజయ భాస్కర రెడ్డి దగ్గర్నిండి, భవనం వెంకట్రామ్, నందమూరి తారకరామారావు లాంటి స్థాయి కలిగిన నాయకుల వద్ద పనిచేసన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడి వద్ద నుంచి సామాన్య ప్రజలు, భవిష్యత్తు లో నాయకులు కావాలనుకొనే వారు ఏమాశిస్తారు..?


హుందాతనం, గాంభీర్యం, జాలి, దయ, కరుణ..తేదేపా అధినేత చంద్రబాబు గారి వద్ద నుంచి ఆంధ్రప్రజలువే కోరుకుంటారు. కానీ ఈ మద్య బాబుగారేమో.. మాట్లాడితే రౌడీలు, గుండాలు, ఆకు రౌడీలు, డెకాయిట్లు, ఎదుటి వారిని ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఛెడా - మడా తిట్టేస్తున్నారు.


ఎటువంటి భేషాలు లేకుండా ఆంధ్రప్రజల కష్టార్జితాన్ని తన సొంత తాతల-తండ్రుల ఆస్థి అన్నట్లు నేను మీకు  చెక్కులిచ్చా..నా చెక్కులు చెల్లుతాయి, నా రోడ్ల మీద మీరు తిరుగుతున్నారు, నా పింఛన్ మీరు తీసుకుంటున్నారంటూ అడ్డంగా..చరిత్ర అనేది ఒకటుంటుందని..దానికి మనం - మనవాళ్లందరూ సమాధానం చెప్పాలన్న స్పృహలేకుండా మాట్లాడుతున్నారు.  


ఘన కీర్తి వహించిన బాబు గారిని ఆంధ్ర ప్రజలు అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని అడుగుతుంది ఇండియాహెరాల్డ్...అది తమరు ‘అయిదేళ్ళధికారంలో ఉండి యంత్రాంగం-మంత్రాంగం ఉండి ఇప్పుడు రౌడీలు, గుండాలు అంటున్నారు..మరి ఇంతకాలం బజ్జున్నారా?’

మరింత సమాచారం తెలుసుకోండి: