గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది.  యావదాంధ్రప్రదేశ్ నే కాదు..తెలుగు జాతిని ఉర్రూతలూగించిన  ఏఎన్నార్ - ఎన్టీఆర్ ఇద్దరూ ఇక్కడివారే..
వైసీపీ స్టార్ కొడాలి నాని నియోజకవర్గం, దాదాపు దశాబ్ధపైబడి కొడాలి నాని వెనుకున్నారు గుడివాడ జనం.  నానికి ప్రభుత్వ సహకారం లేకపోయినా తన చేతనయిన అభివృద్ది చేస్తున్నాడని అంటారు ఇక్కడి జనం. 


వైఎస్ షర్మిల, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, మచిలీపట్నం అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పాల్గొన్న ప్రచార సభ తేదేపా అభ్యర్థులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందన్నారు రాజకీయ విశ్లేషకులు,  మండుటెండలో హాజరయిన వేలాది జనం, నాయకుల ప్రసంగాలకు వారు స్పందించిన విధానం గుడివాడ ప్రజ నాని వెంట ఉన్నాని చెప్పకనే చెప్పారు.


అయితే వైసీపీ ప్రచార కర్త షర్మిల  చెప్పిన మాటలు మాత్రం గుడివాడ జనాల్నే కాదు యావదాంధ్ర జనాలను కదిలించి-ఆలోచింప చేసేట్టుంది. 
పిల్లలు - పసిగుడ్డుల విషయంలో మనమెంత జాగ్రత్తగా ఉంటామో తెలియంది కాదు.. అలాంటిది చంద్రబాబు ఆ గర్భాదశ శిశువును మోసం చేశాడని, ఆడబిడ్డ పుడితే 25 వేలు ఇస్తానని హామీ ఇచ్చిన ఆయన ఐదేళ్ల అధికారంలో ఆ ఆడబిడ్డల ఊసే పట్టించుకోలేదని..అలాంటాయన ఈ రోజు ఆల్ - ఫ్రీ అంటున్నాడని  మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు షర్మిల. అయితే ఇది ఆలోచించవలసిన విషయమే కదా అంటున్నారు ఆంధ్రప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: