జనం..జనం..జనం..ఏ జెండా అయినా జనం కామనైపోయారు...నేటి రాజకీయాల్లో.. ఆ నాయకుడు, ఈ నాయకుడు, ఏ నాయకుడు అయినా వేలల్లో జనం.. ఇసుకేస్తే రాలనంత జనం..జనం.జనం!జనం!


జనసేన...జేడీ లక్ష్మీ నారాయణ మాటల్లో దాదాపు 150 స్థానాలు గెలుచుకోబోయే పార్టీ ఇది..జనసేన రాజు, సైనికుడు పవన్ కళ్యాన్..స్టార్ హీరో, క్రేజ్ పుల్లర్..మరి అటువంటి పవన్ సభలో జనం లేక క్యాన్సిల్ చేశారంటే..ఏమీటర్థం?


ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెదేపా- కేఏ పాల్ ల సరసన పవన్ జాయినైపోయాడని వైసీపీ వారు సోదాహరణంగా ఆరోపిస్తున్నట్లే..జనం కూడా జనసేనను తేదేపా తోక పార్టీలా చూస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


పోనీ ఈ సభలు ఎక్కడో గుంటూరులోనే..పులివెందులలోనే రద్దయ్యాయా అంటే లేదు, పవన్ కు ఎంతో పట్టుంది అని జనసేన చెప్పుకుంటున్న ఉత్తరాంధ్ర పెందుర్తి, చోడవరం, అనకాపల్లిలో.. జనసేన పవన్ కు ఐదు కంటే ఎక్కువ సీట్లు రావని అన్ని సర్వేలు చెబుతున్న మాట నిజమవుతుందేమో? మే 23 న చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: