గుడివాడకు మెడికల్ కాలేజీ, నాలుగు లైన్ల రోడ్డు, బస్టాండ్‌ , రింగ్ రోడ్డు చేయిస్తానని గుడివాడకు వచ్చి చంద్రబాబు చెప్పడాన్ని కొడాలి నాని.. ఎన్నికల ప్రచారంలో దుయ్యబడుతున్నారు. చంద్రబాబును నమ్మడం చాలా ప్రమాదకరం అంటూ గుడివాడ ప్రజలకు వివరిస్తున్నారు. నాని సభలకు విశేష స్పందన లభిస్తోంది.


తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గుడివాడకు కనీసం జూనియర్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారన్న కొడాలి నాని. నమ్మినవారి పట్ల చంద్రబాబు చాలా ప్రమాదకరంగా వ్యవహరిస్తారని తెలిపారు. నమ్మినవారికి వెన్నుపోటు పొడవటం చాలా అలవాటు అంటూ దుమ్మెత్తిపోశారు. 

చంద్రబాబుకు కనీసం అనాథలన్నా జాలీ దయా ఉండన్న కొడాలి నాని.. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్ పల్లిలో పోటీ చేయించి ఓడించారని విమర్శించారు. తన ప్రాణ స్నేహితుడైన ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ శవం పక్కన ఉండగానే టీఆర్‌ఎస్‌ తో పొత్తుకు ప్రయత్నించిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు దేవినేని నెహ్రూ కుమారుడు అవినాశ్‌ కుమారుడికి గుడివాడ టికెట్ ఇచ్చి అన్యాయం చేశాడని నాని అన్నారు. 

చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదన్న నాని.. జగన్‌ను గెలిపిస్తే నవరత్నాల పథకాల్లో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాడని వివరించారు. కొడాలి నాని సభలకు జనం విరగబడి రావడం కనిపించింది. ఈ జోరు చూస్తుంటే కొడాలి నాని విజయం ముందుగానే ఖరారైనట్టు కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: