జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు ఇటీవల ఎన్నికలకు ఇంకా రెండు నెలలు ఉందనగా పార్టీలో చేరిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో వారసత్వ రాజకీయాలకు మరియు కుటుంబ పాలనకు నేను విరుద్ధం అని భారీ బహిరంగ సభలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ కేవలం రెండు నెలల ముందు పార్టీలో చేరిన తన అన్నయ్య నాగేంద్ర బాబు కి నరసాపురం పార్లమెంట్ స్థానం కేటాయించడం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.


ఇదిలా ఉండగా ప్రస్తుతం నరసాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాగేంద్రబాబు తో పాటు ఆయన కుమార్తె నిహారిక కూడా జనసేన పార్టీకి ప్రచారం చేసింది.


ఈ నేపథ్యంలో తండ్రీ కూతుళ్లు ఇద్దరు కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో నిహారిక ని చూడటానికి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రావడం జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్రబాబు ప్రస్తుత రాజకీయాల గురించి మరియు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేకూరే విషయాల గురించి అర్థవంతంగా ఎన్నికల ప్రచారంలో తెలియజేస్తూ ముందుకు సాగారు.



మరింత సమాచారం తెలుసుకోండి: