చంద్రబాబునాయుడుకు చాలా
కాలంగా ఓ కీరిక తీరకుండా ఉండిపోతోంది. అదేమిటంటే మనవడు దేవాన్ష్ తో సరదాగా
ఆటలాడుకోవటం. ఈ విషయాన్ని ఎవరో చెప్పటం కాదు స్వయంగా చంద్రబాబే ఎన్నోసార్లు
చెప్పారు. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఈ కోరిక
రాబోయే ఎన్నికల తర్వాత తీరబోతోందా ? అన్న
అనుమానం మొదలైంది. అదికూడా చంద్రబాబు మాటలు విన్న తర్వాత అనుమానం మరింత
పెరిగిపోతోంది.
ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు ? ఏమన్నారంటే, ‘రాబోయే ఎన్నికల్లో ఓడిపోయినా తనకొచ్చే ఇబ్బంది ఏమీ లేదట. తనకు ఫ్యామిలీ ఉందని, మనవడు కూడా ఉన్నాడు’ అంటూ చెప్పుకొచ్చారు. అంటే అర్ధమేంటి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి ఓటమి తప్పదని చంద్రబాబుకు కూడా అర్ధమైపోయిందా ? అనే చర్చ పార్టీలో జోరుగా మొదలైంది.
ఎన్నికల పోలింత్ దగ్గర పడుతున్నా పార్టీలో కుమ్ములాటలు మాత్రం తగ్గలేదు. పైగా చాలా చోట్ల అభ్యర్ధులకు ప్రచారంలో చుక్కెదురవుతోంది. జనాలు కూడా కొన్నిచోట్ల టిడిపి అభ్యర్ధులపై తిరగబడుతున్నారు, నిలదీస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో పాటు కుటుంబం నిర్వహిస్తున్న రోడ్డుషోలకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా కాబోయే సిఎం జగనే అనే ఊపు కనబడుతోంది.
ఇటువంటి సమయంలో చంద్రబాబు నోటినుండి ఓడినా తనకొచ్చే ఇబ్బంది ఏమీ లేదనే మాటలు ఎందుకు వచ్చినట్లు ? చంద్రబాబు పాల్గొంటున్న రోడ్డుషోలే ఫ్లాప్ అవుతున్నాయి. తనకు మద్దతుగా ప్రచారం చేస్తారని తీసుకొచ్చిన పొరుగు రాష్ట్రాల నేతల వల్ల కూడా పెద్దగా ఉపయోగం కనబడలేదనే చర్చ పార్టీలో జరుగుతోంది.
అందుకే ‘చంద్రబాబుకు సీన్ అర్ధమైపోయింద’ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు స్పీచ్ అయిపోయిన వెంటనే ‘చంద్రబాబు కోరికను తధాస్తు దేవతలు తీర్చుగాక’ అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.