నిన్నటి విరామం తరువాత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ రోజున ఆయన ఏకంగా మూడు జిల్లాలను కవర్ చేసేందుకు షెడ్యూలు చేసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ జగన్ ప్రసంగించే వేదికలు, ప్రాంతాల పేర్లు, సమయం గూర్చిన సమాచారం తెలిపారు.

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ బుధవారం గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి, 11.30 గంటలకు గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల, మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు, 3.30 గంటలకు కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటుచేసే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.

ఆయనతో పాటుగా ఆయన తల్లి గారు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై ఎస్ విజయమ్మ   బుధవారం విజయనగరం జిల్లాలోని గజపతినగరం, విశాఖ జిల్లాలోని మాడుగుల, చోడవరం శాసనసభా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు, కృష్ణా జిల్లాలోని కైకలూరు, పెడన  నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: