నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తున్న నాగబాబు సరిగ్గా ఎన్నికల ముందు అతని తమ్ముడు పెట్టిన జనసేన పార్టీలో చేరారు. ఇక ఆయన తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రచారం ముమ్మరంగా చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే అతనికి సహకారంగా ఆయన కూతురు, మెగా డాటర్ కొణిదెల నీహారిక కూడా రాత్రి పూట ప్రచారంలో పాల్గొన్నారు.

నాగబాబు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూడా గత అయిదేళ్ళు ఉన్న నాయకులను ఎన్నుకుంటే ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా తయారు అవుతుందని నాగబాబు అన్నారు. తన తమ్ముడు, వాళ్ళ జనసేనాని పవన్ కళ్యాణ్ నిరు పేదలు, పేదలు, ఎగువ మరియు దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు మొన్న రిలీజ్ అయిన మేనిఫెస్టో లో పొందుపరిచారు అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక పోతే ఇపుడున్న తెదేపా ప్రభుత్వం కోట్లకు కోట్లు రూపాయలు అవినీతి అక్రమాలు చేసిందని, సగటు మనిషి జీవంచడానికి ఆస్కారం లేకుండా గాలి, నేల, నీళ్ళు కలుషితం అయిపోయాయి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు జనసేన ప్రభుత్వం తోనే మొదలవుతాయి అని తేల్చి చెప్పారు. నీహారిక ప్రసంగించక పోయినా ప్రచారం ఆసాంతం తన తండ్రికి తోడుగా నిలబడి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: