తారాలోకం మొత్తం వైసీపీ పార్టీ వెంట తరలి వచ్చిన వేళ, ప్రముఖ నటి నటులు అయిన రాజశేఖర్ మరియు ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రస్తావించారు.

ఆమె మాట్లాడుతూ చంద్రబాబు కుల రాజకీయాలకు పెట్టింది పేరు అని, ఆయన ఒక కులానికి లబ్ధి చేకూర్చే విధంగా తన పరిపాలన పద్ధతిని అవలంబించుకున్నారు అని అన్నారు. జగన్ వస్తే మాత్రం అన్ని కులాలకు సమతుల్యం జరుగునట్లు చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యాక్ ఆయన వేసే ప్రతీ అడుగు అటే దారి తీస్తుందని అన్నారు.

ఇక పోతే కేసీఆర్ మరియు జగన్ పొత్తు పెట్టుకున్నట్లు వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ కేవలం జగన్ కు వచ్చే ఓట్లను ప్రభావితం చేసేందుకు వస్తున్న ఆరోపణలు అని అసలు అలాంటిది ఏమి పార్టీలో జరగట్లేదని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: