ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హార శైలిలో మార్పు వ‌చ్చిందా?  దేశంలోనే సీనియ‌ర్ అని చెప్పుకొనే చంద్ర‌బాబు ఆ సీనియారిటీని కోల్పోయి సైతం వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు ఎందుకు దిగుతున్నారు? ఆయ‌న‌లో మొదలైన ఓట‌మి భ‌య‌మే కార‌ణ‌మా? ఈ చ‌ర్చ ప్ర‌స్తుతం ఏపీలోని రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనే కాదు...టీడీపీ వ‌ర్గాల్లోనూ జ‌రుగుతోంద‌ని అంటున్నారు.


వివ‌రాల్లోకి వెళితే.... సోమవారం ఎన్నికల ప్రచారం ముగించుకుని నేరుగా జ‌గ‌న్‌ లోటస్ పాండ్‌కి వెళ్లారు. మంగళవారం ప్రచారం కొనసాగించకుండా విశ్రాంతికి ప్రాముఖ్యతనిచ్చారు. అయితే ఆ సమయంలో పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా స్థానిక నాయకులతో సమీక్షలు నిర్వహించారని స‌మ‌చారం. ఈ నేపథ్యంలో జగన్ ఒక రోజంతా పూర్తిగా ప్రచారానికి దూరంగా ఉండటంతో ఏదో కుట్రకు ప్లాన్ చేస్తున్నారు జాగ్రత్త అంటూ పార్టీ నాయకులకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.


టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో  టీడీపీ అధినేత చంద్రబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  తాజాగా నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నాడు జాగ్రత్త అంటూ పార్టీ నాయకులను హెచ్చరించారు. జగన్ ప్రచారం ఆపేసి ఒక రోజంతా లోటస్ పాండ్‌లోనే గడిపితేనే...చంద్ర‌బాబు ఇంత‌గా వ‌ణికిపోవ‌డం ఏంట‌ని తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: