ఎన్నికల్లో గెలవాలంటే రెండు దార్లు ఉంటాయి. అది కూడా నియమాలకు లోబడి గెలవడం.. ఎలాగైనా గెలవడం.. ఎలాగైనా గెలవాలను అనుకుంటే నీతి నియమాలకు తావు ఉండదు. చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అనుసరించిన తీరు అదే. యుద్ధానికి రాబోతుంది అభిమన్యుడు కాది అర్జునుడి అని తెలిశాక తన కుయుక్తులకు మరింత పదును పెట్టి తన జీవితానికే చివరి ఎన్నికలైన ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని ఈమధ్యనే వైసిపిలో చేరిన సిని హీరో తనీష్ అన్నారు.


ప్రజాశాంతి పార్టీ పాల్ గారిని ఈ రాజకీయ చదరంగంలో పావుగా వాడుకుంటూ అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారు. జరుగబోయే ఎన్నికల్లో టిడిపి బలహీనంగా ఉన్నచోట వైసిపి అభ్యర్ధి పేర్లకు దగ్గరగా ఉన్న వారిని ఎంచుకుని వారికి ప్రజాశాంతి పార్టీ తరపున అభ్యర్ధులుగా నిలబెట్టి.. ప్రజల్ని మభ్యపెట్టి.. వైసిపి పడాల్సిన ఓట్లకు గండి కొట్టాలని చూస్తున్నారని తనీష్ అన్నారు. ఇదంతా చేసి తన అభ్యర్ధులను గెలిపించుకోవాలన్నది బాబు గారి ప్లాన్ బట్టబయలు చేశారు. 


రాష్ట్రం మొత్తం మీద దాదాపు 35 మందికి ఎమ్మెల్యేగా.. 4 అభ్యర్ధులకు ఎంపి టికెట్లు ప్రజాశాంతి పార్టీ ద్వారా టికెట్లు ఇచ్చింది. ఎప్ప్పుడు దేవుడు దేవుడు అంటూ చెప్పే పాల్ దెయ్యాలతో కలిసి చేసిన మోసాన్ని ఒక్కసారి చూసి షాక్ అవుతున్నారు. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధులకు దగ్గరగా ఉన్న పేర్లతోనే ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధుల పేర్లు ఉండటం ఆశ్చర్యకరం.     


పెనమలూరు నియోజక వర్గాన్ని తీసుకుంటే అక్కడ వైసిపి అభ్యర్ధిగా కొలుసు పార్ధసారధి నిలబడగా.. ప్రజాశాంతి పార్టీ నుండి వి. పార్థసారధికి టికెట్ ఇచ్చారు. మైలవరంలో కూడా వైసిపి అభ్యర్ధిగా వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తుండగా ప్రజాశాంతి పార్టీ నుండి బి. వెంకట కృష్ణా రావు పోటీ చేస్తున్నారు. పెదకూరుపాడులో కూడా వైసిపి తరపున నంబూరు శంకర్ రావుని నిలబెడితే ప్రజాశాంతి పర్టీ తరపున కూడా మరో నంబూరి శంకర్రావుని నిలబెట్టారు. పర్చూరు నుండి దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసిపి అభ్యర్ధి కాగా ప్రజాశాంతి నుండి డి వెంకటేశ్వర్లుని నిలబెట్టారు.   

ఇలా వైసిపి అభ్యర్ధుల పేర్లకు దగ్గరగా ఉన్న పేర్లున్న అభ్యర్ధులను ఏరి మరి ప్రజాశాంతి పార్టీ తరపున టికెట్లు ఇచ్చారు. పేర్లు ఒక్కటే కాదు పార్టీ గుర్తు కూడా వైసిపి ఫ్యాన్ కు దగ్గరగా ఉండేలా హెలికాఫ్టర్ ను ఉంచారు. హెలికాఫ్టర్ ఫ్యాన్ ను వైసిపి ఫ్యాన్ అనుకుని ఓట్లు గుద్దుతారని వాళ్ల నమ్మకం. మొత్తానికి పాల్ గారితో బాబు వేసిన మాస్టర్ ప్లాన్ ప్రజలకు తెలియడంతో ఇప్పుడు మరింత జాగ్రత్త వహించే అవకాశం ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: