డోన్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్ర నాథ్ తన ప్రత్యర్థులకు బలమైన సవాళ్లు విసురుతూ అక్కడి రాజకీయ పరిస్థితి వేడిని పెంచారు. రాత్రికిరాత్రే తప్పుడు ఆరోపణలతో ఉన్న పాంప్లెట్లు పంచడం చిల్లర వ్యక్తులు చేసే పనులు అంటూ గట్టిగానే ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. డోన్ పరిధి లోని ఏ సెంటర్ లో అయిన తను బహిరంగ చర్చలకు సిద్దం అని ఆయన సవాల్ విసిరారు.

ఏదైనా ఉంటే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలని ఇలా చేతగాని తనంగా తప్పుడు ఆరోపణలు చేయకూడదు అని హితవుపలికారు. చర్చకు అందరూ ఆహ్వానితులే అంటూ అందరికీ పిలుపునిచ్చారు బుగ్గన.ఏవైనా ఆరోపణలు ఉంటే నేరుగా వచ్చి చేయాలని ఇలా ప్రింటింగ్ ప్రెస్ పేరు కూడా లేకుండా పాంప్లెట్లు పంచడం సరికాదన్నారు. ఇలాంటి దొంగచాటు వ్యవహారాలు ఎవరు చేస్తున్నారో తనుకు తెలుసని, ప్రత్యేకంగా తనని బహిరంగ చర్చకు ఆహ్వానిస్తున్న అంటూ కౌంటర్ ఇచ్చారు.బహిరంగ చర్చకు అన్ని మతాల పెద్దలు, ఊరిలోని పెద్దలు అందరూ రావాలని, నా పై చేసే ఆరోపణలు అన్నిటికీ తను సమాధానం చెప్పడానికి రెడీ గా ఉన్నాను అన్నారు.

తాను అడిగే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. నా పై ఆరోపణ చేసింది ఒక చీప్ వ్యక్తి అని ఆ వ్యక్తి ఎవరో అందరికి తెలుసు అంటూ ఆయన మండిపడ్డారు. ఆ వ్యక్తి నీ ప్రత్యేక అహ్వానితుని గా పిలుస్తున్నాను అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: