గుడివాడ రోడ్డు షో లో పర్యటిస్తున్న షర్మిల మరోసారి అధికార పక్షం చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ఏం అర్హత ఉందని లోకేష్‌కు మూడు శాఖలున్న మంత్రి పదవిచ్చారని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళ. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్నికల ప్రాచారం సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ.ప్రజలను బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి మభ్య పెట్టే ఓట్లు లాకున్నారు అంటూ ధ్వజమెత్తారు షర్మిల.

చంద్రబాబు వాళ్ళ అబ్బాయి కి జాబు మాత్రమే తెచ్చుకున్నారు కానీ ప్రజలను గాలికి వదిలేశారని ఆమె నిందించారు. జాబు అంటే అర్హత లేని మీ కొడుకుకి ఇవ్వడం కాదు అర్హత కలిగి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు చేయూత నివ్వడం అని ఆమె గుర్తుచేశారు.ఒక్క ఎన్నికైనా గెలవకుండా, ఏ అనుభవం, అర్హత ఉందని లోకేశ్‌ను మూడు శాఖలకు మంత్రిని చేశారని షర్మిళ అన్నారు.

ఇది పుత్ర వాత్సల్యం కాదా అని చంద్రబాబును అడుగుతున్నా  అంటూ షర్మిళ మాట్లాడారు. గుడివాడలో ఆమె నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: