చంద్రబాబు వాళ్ళ అబ్బాయి కి జాబు మాత్రమే తెచ్చుకున్నారు కానీ ప్రజలను గాలికి వదిలేశారని ఆమె నిందించారు. జాబు అంటే అర్హత లేని మీ కొడుకుకి ఇవ్వడం కాదు అర్హత కలిగి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు చేయూత నివ్వడం అని ఆమె గుర్తుచేశారు.ఒక్క ఎన్నికైనా గెలవకుండా, ఏ అనుభవం, అర్హత ఉందని లోకేశ్ను మూడు శాఖలకు మంత్రిని చేశారని షర్మిళ అన్నారు.
ఇది పుత్ర వాత్సల్యం కాదా అని చంద్రబాబును అడుగుతున్నా అంటూ షర్మిళ మాట్లాడారు. గుడివాడలో ఆమె నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నారు