కడప జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మైదుకూరు టీడీపీ అభ్యర్థి, టీటీడీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. జిల్లా ఇన్‌కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.  


పుట్టా సుధాకర్ యాదవ్ ఆర్థికంగా బలమైన వ్యక్తి.. ఆ అండ వల్లే ఆయనకు  మైదుకూరు టికెట్ ఇచ్చారు. ఆయన గత ఎన్నికల్లోనూ ప్రొద్దుటూరు నుంచే పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 

పుట్టా సుధాకర్ యాదవ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకూ.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కూ వియ్యంకుడు కావడం విశేషం. ఈ ఎన్నికల్లో ఆయన ధనబలం ప్రదర్శించవచ్చని భావించిన ఐటీ అధికారులు దాడులకు పాల్పడి ఉండొచ్చని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: