టీడీపీ నాయకురాలు సాదినేని యామిని మరోసారి వైసీపీ పై ఘాటు విమర్శలు చేశారు..విజయమ్మ విలువలు,విశ్వనీయత గురించి జగన్ కి నేర్పించి ఉంటే బాగుండేదంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. వైఎస్ మరణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 


ఎన్నికల ప్రచారం చేస్తున్న విజయమ్మ లక్ష్యంగా సాదినేని యామిని విరుచుకుపడ్డారు. వైఎస్. విజయమ్మకు వైఎస్ మరణం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకువస్తుందంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పసుపు కుంకుమ పథకం ఆపాలని జగన్  దొడ్డిదారిన కేస్ వేయించడం దారుణమైన చర్యని యామిని అన్నారు. 

టీడీపీ తోనే అభివృద్ధి సాధ్యమని వైసీపీ వస్తే అరాచకమేనని యామిని హెచ్చరించారు. అయితే రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు.. కానీ సున్నితమైన అంశాలపై సాదినేని యామిని అనుచిత వ్యాఖ్యలను జనం అసహ్యించుకునే ప్రమాదం ఉంది.

వైఎస్‌ మరణం వంటి అంశాలను కూడా యామిని లాంటి వారు రాజకీయ అస్త్రాలుగా మలచుకోవడమేంటన్న విమర్శలు వస్తున్నాయి. ఆమె ఇప్పటికే వైఎస్ కుటంబపమే తేడా కుటుంబమంటూ ఇటీవల కామెంట్ చేశారు. ఆమె కామెంట్లను వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఐనా.. యామిని మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: