వైసీపీ అధినేత జగన్ కు అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు అని సర్వేలు చెబుతున్నాయి. అయితే టీడీపీ నేత చంద్రబాబు చేసే ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వైఎస్ వివేకనందరెడ్డి హత్యను జగన్ పై తోసేయలని టీడీపీ కుట్రలు విఫలమయ్యాయి అని వెల్లడిస్తున్నాయి. అయితే ప్రధాన పోటీ జగన్, చంద్రబాబు లదే అని, పవన్ కళ్యాణ్ మేనియా గోదావరి జిల్లా వరికే పరిమితం అంటున్నాయి సర్వేలు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పు జగన్ తోనే సాధ్యం అనే ఆలోచనలో ప్రజలు ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీ విజయం తధ్యం అని చెప్పలేము కానీ ఇది అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలిచిన అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఒక్క రాత్రి లోనే రాజకీయ పరిస్థితుల ను మార్చగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు కాబట్టి తక్కువ అంచనా వేయలేం.